ఉప్పల్, జనవరి 30: పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నాచారం డివిజన్కు చెందిన లబ్ధ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, సాయిజెన్ శేఖర్, సుధాకర్, ముత్యంరెడ్డి, భాస్కర్ ముదిరాజ్, బుచ్చన్నగౌడ్, నర్సింగ్రావు, రెడ్డినాయక్, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
రామంతాపూర్, జనవరి 30: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సూచించారు. ఆదివారం రామంతాపూర్లోని రాజేంద్రనగర్లో రామాంజనేయ స్వామి ఆలయంలో మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటిందన్నారు. కార్యక్రమంలోస్థానిక కార్పొరేటర్ శ్రీవాణి, న్యాయవాది గిరిబాబు, వెంకటేశ్వర్రెడ్డి,సుధాకర్, నర్సింహ, జంగయ్య, కుమారస్వామి, రాజు, చిన్న, శివ, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై వినతి పత్రం
రామంతాపూర్ సత్యనారాయణ కాలనీ, కేసీఆర్నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు తదితర సమస్యలపై ఆదివారం కాలనీవాసులు ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీవాసులు శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, సైదులు, అమర్, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.