అంబర్పేట : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీష్రావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం వైద్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపారు.
నల్లకుంట డివిజన్ తిలక్నగర్ యూపీహెచ్సీ పరిధిలో పని చేసే ఆశా వర్కర్లకు డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి సోమవారం ఎమ్మెల్యే స్మార్ట్ ఫోన్లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఆశావర్కర్లు కూడా సాంకేతికతను ఉపయోగించుకునేందుకు స్మార్ట్ ఫోన్లను అందజేయడం జరుగుతుందన్నారు.
అంబర్పేట నియోజకవర్గంలో 80 మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. కాగా ఈ సందర్భంగా తమకు ఈఎస్ఐ, పెన్షన్ వసతి కల్పించాలని, అందుకు అవసరమైన మొత్తాన్ని జీతం నుంచి జమ చేసుకోవాలని ఎమ్మెల్యేను కోరగా ఆయన సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్ఓ డా.జె.వెంకటి, మెడికల్ ఆఫీసర్ డా.కాలేరు దీప్తిపటేల్, డా.హర్షిత, ఎస్.కె.జ్యోతి, నర్స్ కమల, పీహెచ్ఎం దేవకి, పద్మ, ఆశావర్కర్లు కల్పన, గీత, మంజుల, అనిత, మల్లేశ్వరి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.