మియాపూర్, డిసెంబర్ 14 : పేదల కష్ట నష్టాలలో సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. కల్యాణ మైనా.. కష్టమైనా పూర్తి భరోసాను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదర్నగర్ డివిజన్ బృందావన్ కాలనీకి చెందిన తాండవ కృష్ణ అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం దరఖాస్తు చేసుకోగా రూ. 1.25 లక్షల నిధుల మంజూరు పత్రాన్ని కార్పొరేటర్ శ్రీనివాసరావుతో కలిసి విప్ గాంధీ బుధవారం తన నివాసంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక స్థోమతలేక అనారోగ్యాలకు గురవుతున్న పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదన్నారు. అభాగ్యులకు ఈ పథకం పూర్తి భరోసాను కల్పిస్తున్నదని, కార్పొరేట్ వైద్యం ద్వారా తమ ఆరోగ్యాలకు స్వస్థత పొంది యధావిధి జీవనాలను గడుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కాశీనాథ్, అష్రాఫ్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీలో సమస్యల పరిష్కారంతో పాటు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అసోసియేషన్ ఆధ్వర్యంలో విప్ గాంధీని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. కాలనీలో సమస్యలను పరిష్కరించటమే కాకుండా కమ్యూనిటీహాల్ నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు పూర్తి తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీ వసతుల పరంగా పురోగతివైపు నడిపంచేందుకు కేటీఆర్ తోడ్పాటుతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు చంద్రారెడ్డి, భగవంత్రెడ్డి, నర్సింహులు, సాంబశివుడు, రాంరెడ్డి, హన్మంతరెడ్డి, ఆంజనేయులు, వెంకటరెడ్డి, ప్రేమ్కుమార్, రాజు, చిట్టి బాబు, తిరుపతిరెడ్డి, దశరథ్, రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం చేసుకోవటం అత్యంత సంతోషకరమని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు నియోజకరవ్గ ప్రజల తరపున విప్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో గుణాత్మకమైన మార్పును సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ తీసుకురావటం తథ్యమన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అనతి కాలంలోనే జాతీయ స్థాయిలో అమలు కానున్నాయని, ఇప్పటికే ఇతర రాష్ర్టాలలో ఈ పథకాల అమలును కోరుతుండటమే ఇందుకు నిదర్శనమన్నారు.