ఎల్బీనగర్ : సీఎం కేసీఆర్ కారణజన్ముడని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వూర నర్సింహా గుప్త ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయంలో పూజలతో పాటుగా దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడుగానే కాక బంగారు తెలంగాణ సాధనలో సీఎం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ది పథకాలు దేశవ్యాప్తంగా అందాలంటే సీఎం కేసీఆర్ దేశ నాయకుడు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు వూర నర్సింహా గుప్తతో పాటుగా మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్కుమార్, గడ్డిఅన్నారం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్, వూర శ్రీనివాస్, వరుణ్చంద్ర, శరత్చంద్ర, రమేష్ ముదిరాజ్, యాద శంకర్, కందికంటి ప్రేంనాథ్గౌడ్తో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు.