భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్ప దార్శనికతను, అధ్యయన పటిమను చూసి విద్యార్థులు స్ఫూర్తి పొందాలని సిటీ సివిల్ కోర్టు జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ డాక్టర్ సి.సుమలత విద్యార్థులను కోరారు. అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం ‘సిటీ సివిల్ కోర్టు లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ – ప్రాథమిక బాధ్యతలు’ అనే అంశంపై వెబినార్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ చిన్నతనంలో అనేక అవమానాలను ఎదుర్కొని, పాఠశాలలోకి సైతం రానివ్వని పరిస్థితి నుంచి పట్టుదలతో, స్వశక్తితో గొప్ప అధ్యయన పటిమతో రెండు డాక్టరేట్లు సాధించి దేశం గర్వించే ప్రపం చ మేధావిగా ఎదిగారన్నారు. దేశ పరిస్థితులకు అనుగుణంగా అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించి మనకు అందించారన్నారు. సమావేశంలో సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె.మురళీ మోహన్, న్యా య కళాశాల ప్రి న్సిపల్ ప్రొఫెసర్ ఎస్.బి.ద్వారకానాథ్, వైస్ ప్రిన్సిపల్ పి.అరవింద, పెండేకంటి న్యాయ కళాశాల అకడమిక్ కో ఆర్డినేటర్ శోభారాణి పాల్గొన్నారు.