మన్సూరాబాద్, ఫిబ్రవరి 20: చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్బీనగర్, రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయాల సమీపంలో కొన్ని సంవత్సరాలుగా చట్నీస్ హోటల్ను నడుపుతున్నారు. హోటల్లో కస్టమర్లు కిక్కిరిసి ఉన్న సమయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో హోటల్లో పని చేస్తున్న చత్తీస్ఘడ్, బలోడ బజార్ జిల్లాకు చెందిన జోగేశ్వర్ (20), దయ (23), సుమిత్ (21), సునీల్ (21) గాయడినట్లు పోలీసులు తెలిపారు. స్టీమర్ పేలడంతో ముగ్గురి కాళ్లపై వేడి నీళ్లు పడటంలో తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తికి ఐరన్ ప్లేట్ తలకు తగలడంతో గాయపడ్డాడు. నలుగురిని వెంటనే చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ నగర్లోని ఆధ్యా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై పూర్తిస్తాయిలో విచారణ జరుపుతున్నట్లు సీఐ వినోద్కుమార్ తెలిపారు. హైడ్రా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు తీరును పరిశీలించారు.