హఫీజ్పేట్: చిన్నారులు న్యూమోనియా బారినపడకుండా ఉండేందుకు అందించే న్యూమోకోకల్ టీకా కార్యక్రమాన్ని బుధవారం సాయినగర్ సబ్సెంటర్లో యూపీహెచ్సీ ఇంచార్జ్ డా. వినయ్బాబు ప్రారంభించారు. ఈవ్యాక్సిన్తో న్యూమోనియా, సెప్టిసెమియా, ఆర్ధెటిస్, సైనసైటిస్ లు రాకుండ నివారించవచ్చన్నారు. కొవిడ్ మూడోదశ ముప్పుపొంచిఉన్న నేపధ్యంలో పిల్లలకు న్యూమోనియాతోపాటు కొవిడ్ లక్షణాలుతోడైతే మరింత ప్రమాదకర పరిస్ధితులు తలెత్తుతాయని ఆయన అన్నారు. అందుకే ముందుజాగ్రత్తచర్యగా న్యూమోకోకల్ టీకా వేయించాలన్నారు. ఈవ్యాక్సిన్ను యూపీహెచ్సీలో ప్రతిబుధవారం అందుబాటులో ఉంచుతున్నామని సంవత్సరంలోపున్న ప్రతిచిన్నారికి టీకా వేయించాలన్నారు.