అంబర్పేట, జనవరి 3: పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు టీకాలు వేయించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నల్లకుంట డివిజన్ విద్యానగర్లోని దుర్గాభాయి దేశ్ముఖ్ మహిళా సభ ఆవరణలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15-18 ఏండ్ల చిన్నారులకు నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు. అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ నెహ్రూనగర్, తిలక్నగర్ యూపీహెచ్సీ, బాగ్అంబర్పేట యూపీహెచ్సీ, డీడీఎంఎస్ యూపీహెచ్సీ, ఫీవర్ దవాఖానల్లో 15-18 ఏండ్ల పిల్లలకు టీకాలు వేసేందుకు కేంద్రాలను నెలకొల్పడం జరిగిందని చెప్పారు. ఆయా కేంద్రాలకు తమ పిల్లలను తీసుకెళ్లి టీకా వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. హరిశ్రీ, సిబ్బంది సుజాత, పరిమళ, సువర్ణ, మహేశ్వరి, బిందు, శైలజ, చంద్రకళ, ఆశ వర్కర్లు లావణ్య, అనూరాధ, ప్రియాంక, దుర్గాప్రసన్న, నాగమణి పాల్గొన్నారు.
తిలక్నగర్, బాగ్అంబర్పేట యూపీహెచ్సీలో..
నల్లకుంట డివిజన్లోని తిలక్నగర్ యూపీహెచ్సీలో 15-18 ఏండ్ల పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ వై. అమృత సోమవారం ప్రారంభించారు. ఇందులో మెడికల్ ఆఫీసర్ డా. కాలేరు దీప్తిపటేల్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే బాగ్అంబర్పేట యూపీహెచ్సీలో డివిజన్ కార్పొరేటర్ బి. పద్మావెంకటరెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో డాక్టర్ గీతా, సిబ్బంది దేవకి, మాధురి, రేణుక తదితరులు పాల్గొన్నారు.