అడ్డగుట్ట, డిసెంబర్ 21: ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలను అపహరించుకొని వెళ్లిన నిందితుడిని చిలకలగూడ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. మంగళవారం ఉదయం పద్మారావునగర్కు చెందిన మహిళ(47) ఇంట్లోకి చొరబడిన న్యూబోయిగూడ ఐడీహెచ్ కాలనీకి చెందిన యాదగిరి(33) బీరువాలో ఉన్న 14 తులాల బంగారు ఆభరణాలను తస్కరించాడు.
చిలకలగూడ చౌరస్తాలో యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సొత్తును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.