గోల్నాక : పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి వరంలా మారిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
అంబర్పేట ఆంధ్రకాలనీకి చెందిన విజయ్కుమార్కు రూ.3లక్షలు, నారాయణగూడ శివాజీనగర్కు చెందిన టి.నిర్మలకు రూ.1లక్షా 50వేలు, బాగ్అంబర్పేట తురాబ్నగర్కు చెందిన ప్రసూనకు రూ.రూ.1లక్ష, అదే ప్రాంతానికి చెందిన నాగార్జునకు రూ.26వేలు, తిలక్నగర్కు చెందిన లావణ్యకు రూ. 20వేలు మొత్తం రూ.5లక్షల 96వేల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.