సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర డిఫ్యూటీ డైరెక్టర్(టెక్) స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల మేరకు సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈనెల 16న మహిళల కోసం ఎల్బీనగర్లోని హైదరాబాద్ జిల్లా యువజన, క్రీడా కార్యాలయంలో చెస్ చాంపియన్ షిప్ (ఓపెన్)పోటీలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా యువజన, క్రీడల అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన అర్హతగల మహిళలు ఈ నెల 15న సాయంత్రం 5 గంటల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 98663 17310, 7337 3992 99 లో సంప్రదించాలని సూచించారు.