హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్లోని అమీర్పేట్లో ఉన్న రోశయ్య నివాసం చేరుకున్న ఆయన.. రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి సానుభూతి తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన రోశయ్య.. శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన తమిళనాడు గవర్నర్గా కూడా గతంలో పనిచేశారు. రోశయ్య మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.