సుల్తాన్బజార్, ఫిబ్రవరి 11 : గ్రామ రెవెన్యూ అధికారులను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జాక్ చైర్మన్ గోల్కొండ సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం గన్ఫౌండ్రీలోని మీడియా ప్లస్ ఆడిటోరియంలో సంఘం రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా ఆయన మాట్లాడుతూ 5845 మంది వీఆర్వోల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని.
మరణించిన 178మంది వీఆర్వోల కుటుంబాలకు కారుణ్య నియామకాలను చేపట్టాలని కోరగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అడిషనల్ సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేశ్, సంఘం వైస్ చైర్మన్లు కాందారి భిక్షపతి, రామేశ్వర్రావు, సర్వేశ్, చింత మురళి, మహిళా నాయకురాలు ప్రతిభ, జేఏసీ నాయకులు పరమేశ్, వెంకన్న, మోహన్, వెంకటేశ్వర్లు, వినయ్, శ్రీహరి నాయక్తో పాటు వివిధ జిల్లాల వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.