జూబ్లీహిల్స్, డిసెంబర్ 22 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 113వ వ్యవస్థాపక దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ముంబైలోని కేంద్ర కార్యాలయంలో బ్యాంక్ వ్యవస్థాపకుడు సర్ సొరాబ్జీ పోచ్ఖానావాలా చిత్రపటానికి బ్యాంక్ ఎండీ, సీఈఓ ఎంవీ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వివేక్ వాహి, ఎంవీ.మురళీకృష్ణ, మహేంద్ర దొహారేలతో పాటు ఇతర ఎగ్జిక్యూటివ్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2028 నాటికి నికర సున్నాకు కట్టుబడి ఉన్నామని తీర్మానిస్తూ ఈఎస్జీ విజన్ పత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా బ్యాంక్ ఎండీ, సీఈఓ ఎంవీ రావు, బ్యాంక్ వ్యవస్థాపకుడు సొరాబ్జీ మనవరాలు పిలూ హకీమ్ మాట్లాడుతూ కస్టమర్ సెంట్రిక్ ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు సిబ్బంది ప్రయోజనాలకు అనేక పథకాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈఎస్జీ విజన్ అమలులో దీపక్ బత్రా, మిస్టర్ అతుల్ గుప్తా ప్రయత్నాలకు అభినందనలు తెలిపారు. ఐఐఎం ముంబైతో ఎంఓయూ సంతకాలు చేసిన సందర్భంగా డైరెక్టర్, ప్రొఫెసర్ మనోజ్ కుమార్ తివారీ, డీన్ అండ్ ప్రొపెసర్ శిరీష్సాగిల్లను సన్మానించారు.