ఉద్యానవనాల్లో నిపుణులు చేపట్టిన సేంద్రీయ సాగు పద్ధతులను అనుసరించి.. లాభసాటి వచ్చే పంటలను వేయాలని సీవోఈ డిప్యూటీ డైరెక్టర్, ఐసీఎఆర్ విశ్రాంత అధికారి డాక్టర్ హెచ్పీ సింగ్ రైతులకు సూచించారు. ఆదివారం జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సెంటర్ను సందర్శించి పలు రకాల పంట సాగుబడి వివరాలు, తీరొక్క మొక్కలు, పండ్లు, పువ్వులు, ఆకుకూరలు పెంపకం వంటివి పరిశీలించారు. ఆయన వెంట సీవోఈ డైరెక్టర్ ఎల్.వెంకటరామ్రెడ్డి, ఏడీడీ కమలాకర్, హెచ్వో వేణుగోపాల్, హెచ్ఈవో శ్రుతి, కోరమండల్ కంపెనీ అధికారులు సుధాకర్రెడ్డి, ప్రసాద్, అవినాశ్ తదితరులు ఉన్నారు.