గౌతంనగర్, జూలై 6 : మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధి ,అనంత సరస్వతినగర్లో రూ.96లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే.. కార్పొరేటర్ ప్రేమ్కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ..మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల పరిధిలో వరద, మురుగునీటి సమస్య పరిష్కారానికి కల్వర్టులు, భూగర్భ డ్రైనేజీ, ఆర్సీసీ పైపులైన్ పనులను పూర్తి చేసిన తరువాత సీసీ రోడ్లు వేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు దశలవారీగా పూర్తి చేస్తున్నామని అన్నారు. మ ల్కాజిగిరి నియోజకవర్గంలో దాదాపుగా 80శాతం అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు.
ఎక్కడ సమస్య లు ఉన్నా తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభు త్వం కోట్లాది రూపాయలను హెచ్చిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, డీఈ లౌక్య, ఏఈ శ్రీకాంత్, వర్క్ఇన్స్పెక్టర్ రజినీకాంత్, ఈస్ట్ ఆనంద్బాగ్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సత్యమూర్తి, నాయకులు జీఎన్వీ సతీశ్కుమార్, పిట్ల శ్రీనివాస్, బా బు, సత్యనారాయణ, సంపత్రావు, ఉమాపతి, బ్రహ్మయ్య, సంతోష్రాందాస్, మోహన్రెడ్డి, రఘుయాదవ్, కిషోర్, అనంత సరస్వతి నగర్ కాలనీ అధ్యక్షుడు సిక్క ప్రభాకర్గౌడ్, ప్రధాన కా ర్యదర్శి యాదగిరి, ఇంద్రసేనారెడ్డి, సత్తయ్యగౌడ్, ఇనార్కుమార్, హరీశ్, పెంట య్య, తదితరులు పాల్గొన్నారు.