కవాడిగూడ, ఫిబ్రవరి 5: భోలక్పూర్లో యుద్ధ ప్రాతిపదికన సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత 20 రోజుల క్రితం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపా ల్, భోలక్పూర్ డివిజన్ కార్పొరేటర్ గౌసొద్దీన్ తహతో కలిసి డివిజన్లోని బడీ మసీదు వెనుక భాగంలో గల ఒమేరా హోటల్ నుంచి మల్లన్నగుడి వరకు రూ. 28లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వారం రోజుల నుంచి సీసీ రోడ్డు నిర్మాణ పను లు ముమ్మరంగా సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ డీఈ సన్ని, ఏఈ సుభాష్ల పర్యవేక్షణలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్ నేతృత్వంలో ప్రత్యేక నిధులు కేటాయించి పెండింగ్లో ఉన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
భోలక్పూర్ డివిజన్లో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నాం. ఎమ్మెల్యే ము ఠా గోపాల్ ఆదేశాల మేరకు ఎక్కడైతే రోడ్లు పెండింగ్లో ఉన్నాయో అక్కడ వెంటనే ఆయన దృష్టికి తీసుకెళ్లి ప్రతిపాదనలు తయారు చేసి సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – బి. సుభాష్, (ఏఈ)