బంజారాహిల్స్,ఆగస్టు 31 : సెప్టెంబర్ 1నుంచి రాష్ట్రంలోని పాఠశాలలను తెరవాలని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలితో పాటు మరికొంతమందిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపురికాలనీలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్దకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుతో పాటు మరికొంతమంది మహిళలు మంగళవారం వచ్చారు. స్కూళ్లు తెరవాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేయడంతో పాటు మంత్రి ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారు.