సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా ఐటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్ జెమిని గ్రూపు సీఈఓ ఏమన్ ఇజ్జట్తో పాటు కంపెనీ ప్రతినిధుల బృందం టీ హబ్ను సందర్శించారు. ఈ సందర్బంగా టీ హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస రావు వారితో సమావేశమయ్యారు. టీ హబ్ కేంద్రంగా ప్రారంభమైన టెక్నాలజీ స్టార్టప్ల పనితీరును వారికి ప్రత్యేకంగా వివరించారు.
స్టార్టప్లకు కార్పొరేట్ సంస్థల సహాకారం అవసరం ఉందని, అదేవిధంగా సరికొత్త ఆలోచనలతో ప్రారం భించిన స్టార్టప్ల వ్యవస్థాపకులకు మార్గదర్శకులు(మెంటార్స్)గా పనిచేయాలని కోరారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా వస్తున్న టెక్నాలజీలతో ఔత్సాహికులు ఎలాంటి అప్లికేషన్స్ను రూపొం దించవచ్చు, వారికి ఐటీ పరిశ్రమల నిపుణుల నుంచి ఎలాంటి సహకారం అందుతుందని వారితో టీ హబ్ ప్రతినిధులు చర్చించారని తెలిపారు.