Hyderabad | హైదరాబాద్ షాన్కు మరో అద్భుతం తోడైంది. మాదాపూర్ వద్ద దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పర్యాటకులతో పాటు పట్టణవాసులకు ఫేవరేట్ స్పాట్గా మారింది. నగరంలో ఎన్నో సందర్శన స్థలాలున్నా ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నది.
పగలు, రాత్రి సందర్శకులతో కళకళలాడుతున్నది. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరూ కేబుల్ బ్రిడ్జికి ఫిదా అవుతున్నారు. రాత్రి వేళలో మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో ఈ ప్రాంతం మరో లోకాన్ని తలపిస్తున్నది.