Cantonment BY Election | సిటీబ్యూరో, మార్చి 16 ( నమస్తే తెలంగాణ ) : మే 13న లోక్సభ ఎన్నికలతో పాటు అదే రోజున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్నది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది.
ఏప్రిల్ 18న కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, కంటోన్మెంట్తో పాటు పలు రాష్ర్టాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అధికారులు తెలిపారు.