KTR | హైదరాబాద్లోని అంబర్పేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, వీధి వ్యాపారులతో కాసేపు ముచ్చటించారు. ఈ ప్రచారానికి జనాల నుంచి విశేష ఆదరణ లభించింది.
కాగా, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచేది గులాబీ పార్టీనే అని కేటీఆర్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. మరోసారి హైదరాబాద్ నగర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్కు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా అంబర్పేట ప్రజలను విజ్ఞప్తి చేశారు. పద్మారావు గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ గారికి మద్దతుగా అంబర్ పేటలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.@TPadmaRao @YadavTalasani pic.twitter.com/Lg1TemtXtZ
— BRS Party (@BRSparty) March 31, 2024
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్లు, యువజన నాయకులు రామేశ్వర్ గౌడ్, ముఠా జై సింహ, డివిజన్ ప్రెసిడెంట్ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.