కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 21 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్ను సోమవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఉద్యమకారుడు సంపత్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, మాజీ ప్రజా ప్రతినిధులు కలిసి విడుదల చేశారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ అడుగడుగునా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని స్వరాష్ట్ర సాధనతో బంగారు మయంగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా తరలివెళ్లేలా అందరు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జీడిమెట్ల డివిజన్ సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, గుమ్మడి మధుసూదన్ రాజు, నరేందర్ రెడ్డి, ఎల్లా గౌడ్, అనిల్, పులి మహేశ్, నిజాంపేట్ కార్పొరేషన్ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, సీనియర్ నాయకులు మురళీ యాదవ్, రవికాంత్ పాల్గొన్నారు.