శ్రీరామనవమి సందర్భంగా కూకట్పల్లి రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్కుమార్,
శంభీపూర్ రాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మత సామరస్యాన్ని చాటుతూ ముస్లిం సోదరులు భక్తులకు పానకాన్ని పంపిణీ చేశారు.
– కేపీహెచ్బీ కాలనీ