బొల్లారం/మల్కాజిగిరి, ఏప్రిల్ 14: ప్రపంచ దేశాలు ప్రశంసించేలా హైదరాబాద్ను కేసీఆర్ అభివృద్ధి చేశారని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, మాల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డితో కలిసి బొల్లారం కంటోన్మెంట్ పార్కులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వాకర్స్తో మాట్లాడి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని మరిచిందని, ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, లోక్నాథ్, మల్లేశ్గౌడ్, డోలి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.