ఉప్పల్, ఏప్రిల్ 20 : ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్లోని ఎస్ఆర్ బాంకిట్హాల్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఎన్నికల ఇన్చార్జి జహంగీర్పాషా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కులేదన్నారు. మల్కాజిగిరి ఓటర్లు ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి.. బీఆర్ఎస్ సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, కాంగ్రెస్, బీజేపీలు చేసిన మోసపూరిత వాగ్ధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, భాస్కర్ ముదిరాజ్, సుధాకర్, మేకల హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.