ఖైరతాబాద్, ఫిబ్రవరి 14 : ఖైరతాబాద్ డివిజన్లోని బస్తీల్లో సమస్యలు తిష్ట వేశాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి అన్నారు. శనివారం మహాభరత్నగర్, బీజేఆర్నగర్, ఇందిరానగర్ల్లో స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి బస్తీబాట చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా బస్తీవాసులు గోవర్ధన్రెడ్డికి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. బస్తీల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్నదని, వీధి దీపాలు వెలుగడం లేదని, సీసీ రోడ్డుకు నోచుకోకుండా ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదన్నారు.
ఎక్కడికక్కడ రోడ్లు తవ్వి వదిలేయడంతో ప్రజలు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీజేఆర్నగర్ మైదానం పక్కన ట్రాన్స్ఫార్మర్కు రక్షణ లేకపోవడంతో ప్రజలకు ప్రమాదకరంగా మారిందన్నారు. అధికారులు స్పందించి ఆయా సమస్యలపై దృష్టిపెట్టాలని కోరారు. బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గజ్జెల ఆనంద్, అంజన్ కుమార్, కృష్ణ, కుమార్, వినీత్ కుమార్, సురేందర్, అశోక్, చారి, ఉస్మాన్ పాల్గొన్నారు.