Hyderabad | ఓవైసీ-మిథాని జంక్షన్ మధ్య నిర్మించిన ఫ్లై ఓవర్ సంతోష్నగర్, ఓవైసీ ఆస్పత్రి, మిథాని, చాంద్రాయణగుట్ట ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది. రూ.63కోట్లతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద నిర్మించిన 1.36 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్కు దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరును పెట్టారు.