కంటోన్మెంట్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత (Nivedita) కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) బీ ఫామ్ను అందజేశారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థులకు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న నివేదితకు బీ ఫామ్ (B Forms) లను అందజేశారు.
ఈ సందర్భంగా కంటోన్మెంట్ లో నివేదిత విజయఢంకా మోగించాలని కేసీఆర్ ఆశీర్వదించారు. ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా నిర్వహించి, ప్రజలందరి మన్ననలు పొందాలని సూచించారు. సర్వేలు, దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్యనందిత అందించిన సేవలు, ప్రజల అభిప్రాయం ప్రకారం చూస్తే కంటోన్మెంట్లో గులాబీజెండా ఎగరడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు.
బీఫామ్ అందజేసిన కేసీఆర్కు కంటోన్మెంట్ (Contoanment ) అభ్యర్థి నివేదిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.