బండ్లగూడ : కుంటుంబ కలహలతో బావపై బామ్మర్థులు దాడి చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…చింతల్ మెట్ హసన్నగర్కు చెందిన అక్రమ్ కు బార్కస్కు చెందిన అమ్మయితో పెళ్లి జరిగింది. గత కొన్ని రోజుల క్రితం అక్రమ్ తన భార్యతో గొడవ పడి అమెను పుట్టింటికి పంపించాడు.
ఈ విషయమై అమె తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు కూడ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెద్దల సమక్షంలో నచ్చజెప్పినా వినక పోవడంతో అదివారం మరోసారి మాట్లాడుకుందామని అక్రమ్ను బార్కస్ లోని అత్తగారి ఇంటికి పిలిచారు. అక్కడ అక్రమ్కు అతని అత్తగారి కుటుంబం మధ్య గొడవ జరగడంతో అక్రమ్ తిరిగి ఇంటికి వచ్చాడు.
కాగా తమ సోదరిని తీసుకుపోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కోపం పెంచుకున్న అక్రమ్ బామ్మర్థులు అదివారం రాత్రి హసన్ నగర్లోని అక్రమ్ ఇంటికి వచ్చి దాడి చేశారు. ఘటనను అడ్డుకునేందుకు వెళ్లిన అక్రమ్ స్నేహితుడితో పాటు అక్రమ్కు గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికుల అరుపులతో వారు పారిపోయారు.గాయపడిన వారిని స్థానికులు అస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.