సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై పూర్తి స్థాయిలోఅవగాహన కల్పించేందుకు టీ హబ్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. తాజాగా మూడవ తరం ఇంటర్నెట్గా పిలిచే వెబ్ 3 టెక్నాలజీపై రెండు రోజులుగా టీ హబ్లో నిపుణులతో ప్రత్యేక సదస్సు చేపట్టారు.
బ్రాడ్ రిడ్జ్ కంపెనీ సహకారంతో వెబ్ 3 టెక్నాలజీ నిపుణులతో పలు అంశాలపై చర్చించారు. స్టార్టప్ నిర్వాహకులతో పాటు విద్యార్థులు, వెబ్ డెవలప్మెంట్పై పనిచేస్తున్న వారిని భాగస్వామ్యం చేస్తూ వెబ్ 3 బూట్ క్యాంపును నిర్వహించామని టీ హబ్ ప్రతినిధి తెలిపారు. రెఫీ ఇండియా ప్రతినిధి ప్రణవ్ ఖన్నా, గ్రాఫ్ ప్రొటోకాల్ నుంచి ప్రణవ్ మహేశ్వరి, బిల్డర్స్ ట్రైబ్ నుంచి పరీణ్ లాటియాలు బూట్ క్యాంపులో పాల్గొని వెబ్ 3 టెక్నాలజీపై అవగాహన కల్పించారని తెలిపారు.