బోడుప్పల్, నవంబర్26: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బోడుప్పల్ నగరపాలకసంస్థ పరిధిలో పచ్చదనానికి మౌలిక వసతుల కల్పనకు పాలకవర్గం,అధికారులు పెద్దపీట వేస్తున్నారు. నగరప్రధాన రహదారులు, అంతర్గత రోడ్డుకు ఇరువైపుల పచ్చని మొక్కలు దర్శనమిస్తున్నాయి. నగరంలోని 28డివిజన్ల నుంచి సేకరించిన చెత్తను బోడుప్పల్-మల్లాపూర్ రోడ్డులోని డంపిగ్యార్డుకు నిత్యం తరలిస్తుంటారు. అధికారులు అక్కడ ఎలాంటి దుర్వాసన రాకుండా డంపింగ్యార్డును సైతం హరితవనంలా తీర్చిదిద్దడం విశేషం..
నాలు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బోడుప్పల్ డంపింగ్యార్డులో ఎటుచూసిన పచ్చని చెట్లు,ఆహ్లాదకర వాతావరణం చూపరులను ఆకట్టుకుంటుంది. అక్కడక్కడ ఉన్న పెద్దపెద్ద బండరాళ్లను ప్రత్యేక ఆకర్షణగా అధికారులు తీర్చిదిద్దారు.వివిధ ఔషధహొక్కలతో పాటు పూల మొక్కలతో పచ్చని పోదరిల్లుతో డంపింగ్యార్డు దర్శనమిస్తుంది.
స్వచ్ఛత, పరిశుభ్రత,పచ్చదనానికి అధిక ప్రాధాన్యతకల్పిస్తున్నాం.మున్సిపల్ నిధులు రూ.2.17కోట్లు ఖర్చు చేసి 28 డివిజన్లకు చెత్తసేకరణ ఆటోలు కోనుగోలు చేశాం. డంపింగ్ యార్డులో చెత్త నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పడు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– మేయర్ సామల బుచ్చిరెడ్డి,బోడుప్పల్ నగరపాలక సంస్థ