శేరిలింగంపల్లి, డిసెంబర్ 21: గచ్చిబౌలిలోని పర్యావరణ పరిరక్షణ, శిక్షణ మరియు పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ)లో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ (బీఎంసీ)టెక్నికల్ సపోర్టు గ్రూప్(టీఎస్జీ) సభ్యులకు ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ బుధవారం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు(టీఎస్బీడీబీ) సహకారంతో నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఆన్ ైక్లెమెట్ చేంజ్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ పర్యావరణ, వాతావారణ మార్పులు, జీవనోపాధి పెరుగుదల కోసం రెండురోజుల ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.
ఈ ముగింపు కార్యక్రమంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(ఎన్ఎఫ్డీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సువర్ణ, టీఎస్బీడీబీ కార్యదర్శి, ఐఏఎస్ ఖర్తాడేలతో పాటు ఈపీటీఆర్ఐ డైరెక్టర్ వాణీశ్రీప్రసాద్ పాల్గొన్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్డీబీ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్.నర్సింహమూర్తి, ఈపీటీఆర్ఐ ైక్లెమెట్ చేంజ్ సెంటర్ కో ఆర్డినేటర్ జే.శేష శ్రీనివాస్ విద్య, పరిశోధన, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.