సుల్తాన్బజార్, అక్టోబర్ 11. అన్ని దానాల కంటే రక్త దానం గొప్పదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. నాంపల్లి రెడ్రోజ్ ఫంక్షన్ హాల్లో సోమవారం సిటీ ట్రాఫిక్ పోలీస్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి సీపీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. నిలోఫర్ దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారులకు రక్తాన్ని అందించేందుకు ఈ శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. నిలోఫర్ దవాఖాన వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ (క్రైమ్స్) శిఖా గోయెల్, సిటీ ట్రాఫిక్ పోలీసు అధికారులు చౌహాన్, కరుణాకర్, భాస్కర్తో పాటు ట్రాఫిక్ ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.