కొండాపూర్, జనవరి 19 : అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, డీఎంహెచ్ఓ సృజన, జోనల్ కమిషనర్ శంకరయ్య, చందానగర్ డీసీ సుధాంశులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజల చీకట్లను తొలగిస్తూ వెలుగును చూసేలా ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కండ్లద్దాలను ఉచితంగా అందజేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగును ప్రారంభించారన్నారు. పరీక్షల్లో అవసరమైన వారికి అక్కడికక్కడే రీడింగ్ అద్దాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నారని, ప్రిస్కిప్షన్లో ఉన్నవారికైతే 15 రోజుల్లో అద్దాలను అందిస్తున్నట్లు తెలిపారు. 100 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు డాక్టర్ అరవింద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణి, డాక్టర్ కార్తీక్, ఈఈ శ్రీకాంతిని, సూపర్వైజర్ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీధర్, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణగౌడ్, రవీందర్రావు, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు మిర్యాల రాఘవరావు, జనార్దన్రెడ్డి, ప్రవీణ్, అన్వర్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్ సగర సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యక్రమాన్ని కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమరావతి, సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు నర్సింహాసాగర్, రూపారెడ్డి, రవిశంకర్ నాయక్, కే శ్రీనివాస్ సాగర్, పీ రామకృష్ణ, సాగర్, సాయిబాబా, గణేశ్, చెన్నయ్య, జీ రవిందర్, వర్క్ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, పరమేశ్, ఎస్ఆర్పీ కిరణ్రెడ్డి, ఎస్ఎఫ్ఏ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, జనవరి 19: అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండోవిడత కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన వెస్ట్జోన్ కమిషనర్ శంకరయ్య, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సృజనలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటివెలుగు కేంద్రంలో సిబ్బందితో ఆయన నేత్రపరీక్షలు చేయించుకున్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. మొదటి విడత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు 1,83,000 మందికి కంటిపరీక్షలు నిర్వహించడంతో పాటు 40,000 మందికి కళ్లాద్దాలు అందజేశారన్నారు. అదేస్ఫూర్తితో రెండోవిడత కార్యక్రమం ప్రజల ముందుకు నేడు తీసుకువచ్చామన్నారు. శేరిలింగంపల్లి ఉపకమిషనర్ వెంకన్న, ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ మాన్వీ, బీఆర్ఎస్ నాయకులు మారబోయిన రాజుయాదవ్, చింతకింది రవీందర్ గౌడ్లతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మియాపూర్, జనవరి 19 : కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పీజేఆర్నగర్లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్తో కలిసి ఎమ్మెల్యే గాంధీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడత కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా దిగ్విజయం చేయాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 12 కేంద్రాలలో 100 రోజుల పాటు కంటి వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కండ్ల జోళ్లు ఇస్తారని గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీవో ఇంద్రసేన్, డాక్టర్ రామ్కుమార్, మనుపవన్, మౌనిక, పార్టీ నేతలు సమ్మారెడ్డి, అనీల్రెడ్డి, గణేశ్, దొడ్ల రామకృష్ణ గౌడ్, శ్రీను, కాశీనాథ్, షౌకత్ అలీమున్నా, ఖైసర్, రాజ్యలక్ష్మి, మధులత, లక్ష్మమ్మ, మంజుల, దేవి పాల్గొన్నారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కమ్యూనిటీహాల్లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని పీవో ఉషారాణి, వైద్యాధికారి డాక్టర్ కార్తిక్, డాక్టర్ రవీనాలతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, వార్డు సభ్యులు, మహిళా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
మాదాపూర్, జనవరి 19: మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరానికి కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ విచ్చేసి కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సయ్యద్ గౌస్, మధుసూదన్రెడ్డి, కేవీరెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాస్, సెల్వరాజ్, జైపాల్, శివ నాయక్, రాజు, శానిటేషన్ ఎస్ఆర్పీ శ్రీనివాస్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హఫీజ్పేట్ డివిజన్ పరిధి జనప్రియ నగర్ కాలనీలోని కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని కార్పొరేటర్ వి. పూజిత గౌడ్ విచ్చేసి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు నల్లా సంజీవరెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రవీణ్గౌడ్, కంది జ్ఞానేశ్వర్, సత్యనారాయణ, మహేశ్వరరావు, సుధాకర్, జితేందర్, వెంకట్రెడ్డి, దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.