హైదరాబాద్ : కూకట్పల్లిలోని వెంకట్రావునగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంటి కిటికీలు, తలుపులు, సామాగ్రి ధ్వంసమయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కంప్రెసర్ గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. పేలుడు శబ్దానికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంకట్రావునగర్ వాసులందరూ ఉలిక్కిపడ్డారు. ఈ పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.