రంజాన్ కానుకల పంపిణీలో
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
జవహర్నగర్,ఏప్రిల్ 25 : బీజేపీ నేతల పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని, పాదయాత్రను ప్రజలు నిరాకరిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్లో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మళ్లీ రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశం, రాష్ర్టానికి చేసిందేమీ లేదని, ఆ పార్టీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కార్యక్రమంలో కమిషనర్ జ్యోతిరెడ్డి, మేనేజర్ నగేశ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్మెంబర్లు, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి
కీసర, ఏప్రిల్ 25 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కరీంగూడ గ్రామానికి చెందిన దేశం సంధ్యకు సీఎం సహాయనిధి నుంచి రూ.60వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి లబ్ధిదారురాలికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దరఖాస్తు చేసుకొన్న అర్హులందరికి సాయం అందజేశామన్నారు సర్పంచ్ గోపాల్రెడ్డి, ఉప సర్పంచ్ మాధవరెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జె. సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉమా మహేశ్వర్గౌడ్, రవికుమార్గౌడ్ పాల్గొన్నారు.