BJP | హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఎన్ శ్రీగణేష్ పార్టీని వీడారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పెద్దల సమక్షంలో శ్రీగణేష్ హస్తం పార్టీలో చేరారు. త్వరలో జరగబోయే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున శ్రీగణేష్ పోటీ చేయనున్నట్లు సమాచారం.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితపై శ్రీగణేష్ ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లోనూ ఆయన ఓటమి చవి చూశారు. హైదరాబాద్లోని తుకారం గేట్కు చెందిన శ్రీగణేష్ 1978, ఆగస్టు 8న జన్మించారు.