బడంగ్పేట్, నవంబర్ 1: తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా.. ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ను ఆదరించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. బుధవారం మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడకు చెందిన బీజేపీ బీసీ మోర్చా అధ్యక్షుడు బంటు రమేశ్ తన అనుచరులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మంత్రి బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి, మహిళల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు రాగానే పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచకుండా ఉండి, తిరిగి ఎన్నికల ఫలితాలు రాగానే ధరలు పెంచుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ను రూ.955కు ఇస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రూ. 4 వందలకే అందజేస్తామన్నారు. మహేశ్వరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కొనసాగాలంటె తిరిగి బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఆదరించి.. మరోసారి మీ గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. శంషాబాద్ నుంచి తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు రూ. 6600 కోట్లతో మెట్రో నిర్మాణం చేపడుతామని తెలిపారు. మరో హైటెక్ సిటీగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు బాదావత్ రవినాయక్, లావణ్య రాజు ముదిరాజ్, తేజస్విని శ్రీకాంత్గౌడ్, సుమన్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు సామ్యూల్రాజు , నాయకులు సురేశ్ తదితరులు పాల్గొన్నారు.