కుత్బుల్లాపూర్ జోన్బృందం, అక్టోబర్30: యువతతోపాటు అన్నివర్గాల ప్రజలూ అభివృద్ధిని కొనసాగించే బీఆర్ఎస్ వైపే నిలుస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్ పరిధి సోనియాగాంధీనగర్, సంజయ్గాంధీనగర్-2 కు చెందిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన యువత పార్టీలో చేరారు. చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశానికి భారీగా తరళివచ్చారు. బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మూడోసారి గెలుపుకోసం యువత ఉత్సాహంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ సంక్షేమం, మ్యానిఫెస్టోను యువకులు ఇంటింటా ప్రచారం సాగించాలని సూచించారు. సోనియాగాంధీనగర్కు చెందిన అసీఫ్, ఇమ్రాన్, అస్రాఫ్, సాదిక్, సోనుతోపాటు మరో వందమంది పార్టీలో చేరారు.
మహిళలు బీఆర్ఎస్కు అండగా నిలుస్తూ పార్టీలో చేరడం సంతోషకరమని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. సంజయ్గాంధీనగర్కు చెందిన యువకులతోపాటు పలువురు మహిళలకు ఎమ్మెల్యే కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అమలయ్యే ప్రతి పథకంలోనూ మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. మ్యానిఫెస్టోలోని అంశాలు ప్రతి ఆడబిడ్డా తెలుసుకునేలా వివరించాలన్నారు. ఉమారాణి, షేక్సుల్తానా, ముంతాజ్, స్వరూప, మల్లమ్మ, గీత , కుమారి తదితరులు చేరినవారిలో ఉన్నారు. వీరితోపాటు అరవింద్, హరిప్రసాద్, మహేష్, విజయ్ సహా వందకుపైగా యువకులు పార్టీలో చేరారు.
పేదలతోపాటు అన్నివర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న బీఆర్ఎస్ కారుగుర్తుకే తమ ఓటని స్థానికులు మద్దతు పలుకుతున్నారు. రంగారెడ్డినగర్ డివిజన్ ఇందిరాగాంధీనగర్, సౌభాగ్యనగర్లో సోమవారం కార్పొరేటర్ విజయ్శేఖర్గౌడ్, డివిజన్ ఇంఛార్జి అజేష్నాయర్ నేతృత్వంలో సోమవారంప్రచారం చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ స్థానికులను ఓట్లుఅడగ్గా బీర్ఎస్కే తమ ఓటు అని స్పందించారు. ఎమ్మెల్యే వివేకానంద్ సూచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు వివరిస్తున్నట్టు కార్పొరేటర్ తెలిపారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అమలౌతున్న పథకాలు, భవిష్యత్లో చేపట్టే మ్యానిఫెస్టోలోని అంశాలను స్థానికులకు వివరించారు. నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే వివేకానంద్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని తెలియజేసి మూడోసారి ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట డివిజన్లో సోమవారం కార్పొరేటర్ జగన్ , బీఆర్ఎస్నేతలు ప్రచారం చేపట్టారు. అంజయ్యనగర్లో సమావేశమై మ్యానిఫెస్టో ప్రతులను పంచారు. అనంతరం ఇంటింటా తిరిగి కారుగుర్తుకే ఓటేయడం ద్వారా మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా వివేకానందగౌడ్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని అభ్యర్థించారు. రెండు సార్లు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటేస్తే భవిష్యత్లో మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. మారయ్య, అశోక్,వెంకట్రెడ్డి , స్థానికనేతలు పాల్గొన్నారు.