సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): బిట్ కాయిన్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలొస్తాయంటూ నమ్మించి సాఫ్ట్వేర్ ఇంజినీర్ దంపతులను రూ.60 లక్షలు ముంచేసిన ఘటనలో ఓ సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్పై అరెస్ట్ చేశారు. గత నెలలో అమీర్పేట్కు చెందిన వంశీమోహన్ను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయంటూ నమ్మంచిన ట్రాప్ చేశారు. బిట్జాప్ యాప్ను డౌన్లోడ్ చేయించారు. రూ.60 లక్షలు పెట్టుబడిగా పెట్టిన తరువాత స్క్రీన్పై రూ.5 కోట్లు కన్పిస్తూ వచ్చాయి. ఇంకా పెట్టుబడి పెట్టాలంటూ నేరగాళ్లు ఒత్తిడి తేవడంతో ఇదంతా మోసమని బాధితుడు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. నేరగాడు ఢిల్లీకి చెందిన అనిల్కుమార్గా గుర్తించి అరెస్ట్ చేశారు.