మియాపూర్ , జూన్ 7 : అన్ని రకాల బైక్లను నడపాలన్న సరదా.. దొంగగా మార్చింది.. పార్కుచేసిన కొత్త ద్విచక్రవాహనాలను దొంగిలించి.. వాటిపై పెట్రోల్ అయిపోయేవరకు తిరిగి.. వాటిని అక్కడే వదిలేస్తాడు.. ఇలా 10 బైక్లను దొంగిలించి తిరుగుతున్న దొంగ ఎట్టకేలకు మియాపూర్ పోలీసులకు దొరికిపోయాడు.
సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు.. ఈస్ట్గోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కటకం శివకుమార్(19) 8వ తరగతి వరకు చదివి.. కేపీహెచ్బీ ఠాణా పరిధిలోని ఓ హోటల్లో పార్సిల్ బా య్గా పనిచేస్తున్నాడు…అయితే.. ఇతనికి కొత్త కొత్త బైక్లపై తిరగాలనే సరదా ఉంది..
ఈ క్రమంలో రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో కొత్త బైక్లను దొంగిలించేవాడు.. ఇలా 8 నెలల్లో పది బైక్లను దొంగిలించి.. వాటిపై సరదా తిరిగి పెట్రోల్ అయిపోయిన తర్వాత కొన్నింటిని వదిలేయగా.. మరికొన్నింటిని దాచుకున్నాడు.. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి సోమవారం నిందితుడు శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు.
దొంగను పట్టుకున్న మియాపూర్, బాచుపల్లి పోలీసులను డీసీపీ అభినందించారు. వారికి రివార్డులు అందించేందుకు సిఫారస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, సీఐ వెంకటేశ్, డీఐ మహేశ్ గౌడ్, ఎస్ఐ రవికిరణ్, బాచుపల్లి డీఐ రాజుయాదవ్, వీరభద్రం, పీసీలు రాజేశ్, రాజశేఖర్, శ్రీకాంత్, బలరాం, బాలాజీ, సురేందర్, శివ, సురేశ్, సలీం, సుమ, స్వప్న పాల్గొన్నారు.