దుండిగల్/గాజులరామారం,డిసెంబర్23: పేదప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, బాచుపల్లి, సాయినగర్కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను శుక్రవారం ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ కొలన్ నీలారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలని, అందులో భాగంగానే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి మెరుగైన వైద్యసేవలతో పాటు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్ ధన్రాజు, కార్పొరేటర్ కాసాని శిరీష వీరేశ్, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్, ఎంహెచ్ఓ నిర్మల, మెడికల్ ఆఫీసర్ హర్షిత, కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయప్రసాద్తో పాటు పలువురు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.
శ్రీనివాస్నగర్లో..
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని శ్రీనివాస్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే వివేకానంద్, కార్పొరేటర్ కొలుకుల జగన్ వేరువేరుగా హాజరై ప్రారంభించారు. అనారోగ్యంతో పేదలు ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్, సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణగౌడ్, ఎత్తరి మారయ్య, వేణుయాదవ్, ఇందిరాగౌడ్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పార్కు పరిశీలన..
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్, ఎన్ఆర్ఐ కాలనీలోని పార్కును ఎమ్మెల్యే వివేకానంద్, మేయర్ నీలారెడ్డి, కమిషనర్ వంశీకృష్ణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో పిల్లల ఆటసామగ్రి, వాకింగ్ట్రాక్, ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు సాయినగర్లో అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పలయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు.