చర్లపల్లి, ఏప్రిల్ 9 : యువతను అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, యువత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని స్వతహాగా అభివృద్ధి సాధించాలని ఉప్పల్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు బేతి సుభాష్రెడ్డి, మైనంపల్లి హనుమంత్రావు పేర్కొన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని త్యాగరాజ్నగర్లో ఏర్పాటు చేసిన రెస్ట్రో రెస్టారెంట్ను టీఆర్ఎస్ ఢిల్లీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాల చారి, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, ప్రభుదాస్, స్వర్ణరాజు, సింగిరెడ్డి శిరీషారెడ్డిలతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టకొని ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతుందని వారు గుర్తు చేశారు. అనంతరం యజమానులు వెంకటరాజు, బాలాజీ, వినయ్రెడ్డి, భాస్కర్రెడ్డి అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, శ్రీనివాస్రెడ్డి, నాయకులు కాసం మహిపాల్రెడ్డి, బేతాల బాల్రాజు, సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, కొత్త అంజిరెడ్డి, శంకర్బాబు, మురళీపంతులు, ఏనుగు సీతారామిరెడ్డి, మధుకర్రెడ్డి, బాలకృష్ణ, తిమ్మయ్య, రాఘవరెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాప్రా, ఏప్రిల్ 9: కాప్రా సర్కిల్ పరిధిలో అనధికారిక గేటెడ్ కమ్యూనిటీల పేరుతో రోడ్లకు అడ్డంగా పెట్టిన గేట్లనన్నింటినీ వెంటనే తొలగించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్, టౌన్ప్లానింగ్ ఏసీపీ ఖుద్దూస్, ఇతర అధికారులు, చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. సర్కిల్ పరిధిలోని అనధికార గేటెడ్ కమ్యూనిటీలపై ఆరా తీశారు. సీసీఎస్ అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డి మాట్లాడుతూ.. అక్రమంగా ఏర్పాటు చేసిన గేట్ల వల్ల పరిసరకాలనీల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమూల్య హోమ్స్, భవానీనగర్, భావనారుషి, పల్లెప్యారడైజ్ తదితర కాలనీల్లో ఉన్న గేట్లను తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమూల్యహోమ్స్లో జీహెచ్ఎంసీ పేరిట మార్టిగేజ్లో ఉన్న ఆరు విల్లాలను స్వాధీనపర్చుకోవాలనీ, పద్మావతికాలనీలో ఓ బిల్డర్ చేపడుతున్న బహుళ అంతస్తుల నిర్మాణంలో ఆక్రమణకు గురైన రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంను కబ్జా నుంచి కాపాడాలని డీసీ, ఏసీపీలకు ఎమ్మెల్యే సూచించారు. పోలీసుల సహాయం అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి, టీపీఎస్ సరితాసేన్, చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధులు పద్మారెడ్డి, చంద్రశేఖర్, గగన్కుమార్, సోమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్, ఏప్రిల్ 9 : పేదల ప్రజల ఆరోగ్యం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం హబ్సిగూడ క్యాంప్ కార్యాలయంలో రామంతాపూర్ డివిజన్కు చెందిన నాగేందర్కు రూ. 60 వేలు, అనిల్కుమార్ రూ. 60వేలు, రామేశ్వరికి రూ.14వేలు, సంపూర్ణకు రూ. 36 వేలు, నాగేందర్కు రూ. 44వేలు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి నుంచి ఎందరో లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న, నాగేశ్వర్రావు, శంబుసాయి, ఆలె రమేశ్, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.