బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన శనివారం సైతం కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఎగ్జిబిషన్లో కొలువుదీరిన విభిన్న రకాల లోహ విహంగాల ముందు సెల్ఫీలు దిగుతూ.. సందడి చేశారు.
నింగిలో రంగు రంగుల పొగలు చిమ్ముతూ..విమానాలు, హెలికాప్టర్లతో చేసిన విన్యాసాలు అబ్బురపర్చాయి. నేడు ఎయిర్ షో చివరి రోజు కావడంతో భారీగా సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నది.