బంజారాహిల్స్ : పోలీసు ఉద్యోగాల నియామకాల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగాలు సంపాదించు కోవాలనుకుంటున్న ఔత్సాహికులకు పోలీసుశాఖ ఉచితంగా శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. వెస్ట్ జోన్ పరిధిలో మొత్తం మూడు కేంద్రాల్లో శిక్షణను అందించాలని డీసీపీ జోయల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు.
దీంతో జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో శిక్షణా కేంద్రాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నెం 51లోని జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీకి చెందిన కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఏసీపీ సుదర్శన్. ఇన్స్పెక్టర్ సుదర్శన్ చేతులమీదుగా ప్రారంభించారు. తొలిరోజున సుమారు 450 మంది యువతీయువకులు శిక్షణ కేంద్రానికి వచ్చారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న వారికి ఇక్కడ శిక్షణ ఇస్తున్నామని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి తెలిపారు. రెండునెలల పాటు ఉచిత శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయిని. అభ్యర్థులంతా శ్రద్ధతో చదువుకుంటే ఉద్యోగం సంపాదించడం సులభమే అని ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
నిపుణులైన ట్రైనర్లతో పలు అంశాలపై బోధన ఉంటుందని, వారిచ్చే సూచనలకు అనుగుణంగా సన్నద్దం కావాలని ఏసీపీ సుదర్శన్ సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్ఐ పీడీ.నాయుడు తదితరులు పాల్గొన్నారు.