అంబర్పేట, ఫిబ్రవరి 25 : అంబర్పేట నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్కులకు కొత్త అందాలు తీసుకువస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. నల్లకుంట డివిజన్లోని నరేంద్రపార్కును రూ.42 లక్షలతో ఆధునీకరించే పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి శనివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట తదితర డివిజన్లలో ఉన్న అన్ని పార్కులను రూ.10 కోట్ల ఖర్చుతో సుందరీకరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. కొ న్నింటికి ఇటీవలనే శంకుస్థాపన చేశామని అన్నా రు. ఇందులో భాగంగానే నరేంద్రపార్కును కూడా సుందరీకరిస్తున్నట్లు పే ర్కొన్నారు.
పార్కు చుట్టు కంపౌండ్ వాల్ నిర్మాణం, రెయిలింగ్ ఏర్పాటు, పార్కులో ప్రస్తుతం ఉన్న పాత్వేల స్థానంలో ఒక్కటే పాత్వే, గ్రీనరీ పెంచడం, ఎంట్రెన్స్ మంచి లుక్ ఉండేటట్లు నిర్మించడం, చిన్నారులు ఆడుకొనే పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా కమిటీ ప్రతినిధులు ఆలోచించి, కూర్చొని మాట్లాడుకొని పార్కును ఎలా చేద్దామో తెలపాలని చెప్పారు. త్వరలోనే కాలనీవాళ్లలో చర్చించి నిర్ణయం తీసుకుందామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, సీనియర్ నాయకుడు గాలపల్లి శంకర్, భూపతినాథ్, కూర నరేందర్, భాస్కర్గౌడ్, రాముయాదవ్, సతీశ్చంద్ర, శ్రీనివాస్రెడ్డి, శంకర్గౌడ్, గులాబ్ సతీశ్, అడ్వకేట్ సత్యనారాయణ, సయ్యద్ఖాజా, నందు, శివశంకర్, నందు, శివశంకర్, గాలపల్లి సురేష్, కుమార్, పూర్ణచందర్, అరుణ్కుమార్, సురేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వెంకటేశ్వరనగర్ బస్తీ అభివృద్ధికి కృషి ..
నల్లకుంట డివిజన్ వెంకటేశ్వరనగర్ బస్తీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. శనివారం ఉదయం బస్తీలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ జంక్షన్ను పక్కకు తరలించాలని, నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయించాలని, కొత్త బోరింగులు వేయించాలని, గుడి దగ్గర చెట్ల కొమ్మలను కొట్టించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీటికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. బస్తీవాసులు పాండురంగారావు, నర్సింగ్రావు, సత్యనారాయణ, కె.జె. బాబు, వెంకటేశ్, శ్రీను, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.