వెంగళరావునగర్, సెప్టెంబర్ 19 :ఇండ్లముందు, రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తున్న వాహనాల బ్యాటరీలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఎల్లారెడ్డిగూడలోని తవక్కల్ నగర్కు చెందిన మహ్మద్ అజాం, షరీఫ్ అండ్ సన్స్ అంబులెన్స్ సర్వీసెస్ పేరుతో కార్ల వ్యాపారం చేస్తుంటారు. మంగళవారం తెల్లవారుజామున కారుకు బ్యాటరీ అమర్చాలని కొత్త బ్యాటరీ తెచ్చి ఇంటి బయట పెట్టి లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి చూసేసరికి బ్యాటరీ కనిపించలేదు. దీంతో అక్కడే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు అగంతకులు నంబర్ ప్లేట్ లేని వాహనంపై వచ్చి బ్యాటరీని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే స్థానికులతో కలిసి దొంగల గురించి ఆరా తీయగా ఎల్లారెడ్డిగూడ ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలోని నవత ట్రాన్స్పోర్ట్ వద్ద గుర్తించారు. వారిని పట్టుకొని దేహశుద్ధి చేయగా.. నేరం ఒప్పుకున్నారు. కాలనీవాసులు నిందితుడిని మధురానగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.