HomeHyderabadBasti Davakhanas Started In Nizampet Corporation
ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం
ప్రజల ఆరోగ్యపరిరక్షణకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికప్రాధాన్యత ఇస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నిజాంపేట్ కార్పొరేషన్లో బస్తీ దవాఖానలు ప్రారంభం
దుండిగల్, మే 13 : ప్రజల ఆరోగ్యపరిరక్షణకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికప్రాధాన్యత ఇస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎంసీ) పరిధిలోని 4వ డివిజన్ ప్రగతినగర్, 10వ డివిజన్ నిజాంపేట్, 12వ డివిజన్ ఇందిరమ్మకాలనీ ఫేజ్-2, 31వ డివిజన్లోని రాజీవ్గృహకల్పలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను శనివారం మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, డీఎంహెచ్వో శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంద రూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బస్తీ దవాఖా న లు ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువచేస్తున్నట్లు తెలిపారు. రోగాలను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందించగలిగితే అవిప్రాణాంతకంగా మారకుం డా అడ్డుకోవచ్చునన్నారు.
అదే విధంగా పేదలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిండంతో పాటు ప్రజలు రోగాల బారిన పడకుండా బస్తీదవాఖానలు ఉపయోగపడుతాయన్నారు. బస్తీదవాఖానల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ ధన్రాజు, డీప్యూటీ డీఎంహెచ్ఓ డా.ఆనంద్, మండల వైద్యాధికారి డా.నిర్మల, ఎన్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్లీడర్ ఆగంపాండు, బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, ఆయా డివిజన్ల కా ర్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.