షేక్పేట్ : కాలనీలలో,బస్తీలలో క్రీడల అభివృద్ధి కోసం ఎల్లప్పుడు కృషి చేస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ఆదివారం షేక్పేట్ డివిజన్ లక్ష్మీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ,టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దుర్గం ప్రదీప్ కుమార్తో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యదర్శి షకీల్ అహ్మద్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అఖిలేష్, ప్రధాన కార్యదర్శి నవీన్రెడ్డి, కృష్ణయ్య,రామిరెడ్డి, జనార్ధన్ రెడ్డి, విక్రమ్ వర్మ, శ్రీనివాస్, ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, మాధవ్రావు, అనురాధ, రామ తదితరులు పాల్గొన్నారు.